లక్నో: సయ్యద్ మోదీ ఇంటర్నేషనల్ బ్యాడ్మింటన్ టోర్నీలో భారత స్టార్ ప్లేయర్ హెచ్ఎస్ ప్రణయ్, ధ్రువ్ కపిల అర్జున్ ముందంజ వేశారు. మంగళవారం జరిగిన పురుషుల సింగిల్స్ తొలి రౌండ్లో ఐదో సీడ్ ప్రణయ్ 21-14, 21-18తో డానిలో బోస్నిక్ (ఉక్రెయిన్)పై ఘన విజయం సాధించాడు. 36 నిమిషాలు సాగిన పోరులో ప్రత్యర్థిని అలవోకగా చిత్తుచేసి రెండో రౌండ్లోకి అడుగుపెట్టాడు. వాకోవర్ పద్ధతిలో రెండో రౌండ్లోకి అడుగుపెట్టిన ప్రియాంశు రాజవత్తో ప్రణయ్ తలపడనున్నాడు. మరో సింగిల్స్లో సౌరభ్ వర్మ 21-15, 19-21, 18-21తో అడె ద్వికాయో (అజర్బైజాన్) చేతిలో ఓడాడు. వీరిద్దరు గంటా ఏడు నిమిషాల పాటు హోరాహోరీగా తలపడ్డారు. పురుషుల డబుల్స్ తొలి పోరులో ధ్రువ్, అర్జున్ ద్వయం 23-21, 21-9తో టార్జస్ ఫ్లాటెన్, వెగార్డ్ రిఖైమ్ (నార్వే) జోడీని ఓడించింది. నాలుగో సీడ్ సమీర్ వర్మ, శుభాంకర్ డే గాయం కారణంగా టోర్నీ నుంచి వైదొలిగారు. మహిళల సింగిల్స్ తొలి రౌండ్లో అనుపమ ఉపాధ్యాయ, ఆకర్షి కశ్యప్ ముందంజ వేయగా.. పురుషుల డబుల్స్లో తుషార్ శర్మ, వినయ్కుమార్ సింగ్ 21-8, 21-13తో ఫ్రాన్స్ ద్వయం ఫాబియాన్ డెల్రూ, విలియమ్ వెల్లిగర్ జోడీని ఓడించింది.