ఇప్పుడు ఎక్కడ చూసినా డిజిటల్ చెల్లింపులే..సమోసా తిన్నా.. చాయ్ తాగినా జేబులోంచి ఫోన్ తీసి గూగుల్ పే లేదా ఫోన్ పే చేసేస్తుంటాం. ఇదంతా యూపీఐ వల్లే సాధ్యం. యూపీఐ అంటే యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్ఫేస్. నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా అభివృద్ధి చేసిన బీమ్ యాప్తోపాటు పేటీఎం, ఫోన్పే, గూగుల్పే, అమెజాన్ పే లాంటి ప్రైవేట్ యాప్లు కూడా యూపీఐ చెల్లింపు సదుపాయాన్ని అందిస్తున్నాయి. ఇందుకోసం స్మార్ట్ ఫోన్ ఉండాలి..అందులో ఇంటర్నెట్ ఉండాలి. ఆయా యాప్లను మొబైల్లో డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. అయితే, ఇప్పుడు స్మార్ట్ ఫోన్, ఫీచర్డ్ ఫోన్ ఏదున్నా యూపీఐ ద్వారా బిల్స్ పే చేయవచ్చు.. మీ మొబైల్లో ఇంటర్నెట్ సదుపాయం లేకున్నా ఈ సేవలను వినియోగించుకోవచ్చు. అయితే, ఇందుకోసం కింది విధంగా చేయాలట.