వాషింగ్టన్: కృత్రిమ మేధ సహాయంతో పట్టాలెక్కిన చాట్జీపీటీ భవిష్యత్తు ఆశాకిరణంలా మారింది. ఇంకా ప్రయోగదశలోనే ఉన్నప్పటికీ ఇప్పటికే లక్షల మంది యూజర్లు ఈ వెబ్సైట్లో తమ వివరాలను నమోదు చేసుకొన్నారు. అయితే ఇది డార్క్వెబ్ నిపుణులకు వరంగా మారిందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ కొత్త ఏఐ టెక్నాలజీని ఉపయోగించుకొని ఎలాంటి నైపుణ్యం లేని హ్యాకర్లు సైతం మాల్వేర్ కోడ్ను ఈజీగా రాసేసి, సైబర్ అటాక్స్కు పాల్పడుతున్నట్టు తెలిసింది. ఈ చాట్జీపీటీపై సైబర్ నేరగాళ్లు ఎక్కువగా ఆసక్తి చూపుతున్నారు. ఓ హ్యాకింగ్ ఫోరంలో ఏకంగా ‘చాట్జీపీటీ-మాల్వేర్ ప్రయోజనాలు’ పేరుతో థ్రెడ్ ప్రత్యక్షమైంది. ఇందులో సాధారణ ఫైల్ రకాలను శోధించే పైథాన్ ఆధారిత మాల్వేర్ కోడ్ను ఉంచినట్టు కనుగొన్నట్టు తెలిపారు. చాట్జీపీటీ సహాయంతో ఏ ప్రోగ్రామ్నైనా రన్చేసే సులభమైన జావా స్నిప్పెట్ను రూపొందించినట్టు పేర్కొన్నారు.