అమరావతి : నెల్లూరు జిల్లాలో పోలీసులు టీడీపీ నాయకులను గృహనిర్బంధం చేశారు. ఉదయగిరి నారాయణ అనే వ్యక్తిని పోలీసులు కొట్టి చంపారని ఆరోపిస్తూ టీడీపీ చలో నెల్లూరుకు పిలుపునిచ్చింది. చలో నెల్లూరు కార్యక్రమానికి అనుమతి లేదంటూ జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు టీడీపీ నాయకుల ఇళ్లవద్ద పోలీసులను మోహరించి అడ్డుకున్నారు. కొందరిని అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్లకు తరలించారు.
టీడీపీ నేత, మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్రెడ్డి, జిల్లా అధ్యక్షుడు అబ్దుల్ అజీజ్, కోటంరెడ్డి శ్రీనివాసులురెడ్డి నివాసాల వద్ద పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా సోమిరెడ్డి మాట్లాడుతూ ఘటనపై విచారణ జరిపించాలని, బాధ్యుడైన ఎస్సై కరీముల్లాపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
ఉదయగిరి నారాయణను చంపి సంప్రాదాయబద్దంగా కాకుండా పోలీసు బలగాలను పెట్టి రీపోస్టుమార్టంకు వీలు లేకుండా కాల్చివేశారని విమర్శించారు. నెల్లూరు జిల్లాలో లా అండ్ అర్డర్ పరిస్థితి దారుణంగా తయారవుతుందని, ఎమ్మెల్యేలు, మంత్రులు విలన్లుగా తయారవుతు న్నారని మండిపడ్డారు. కలెక్టర్లు, పోలీసులు డమ్మీలుగా మారుతున్నారని దుయ్యబట్టారు.