న్యూఢిల్లీ : దేశంలో సంభవించిన కొవిడ్ మరణాలపై డెత్ ఆడిట్ నిర్వహించాలని ఢిల్లీ ఎయిమ్స్ డైరెక్టర్ డాక్టర్ రణదీప్ గులేరియా సూచించారు. మహమ్మారిపై పోరాడేందుకు వ్యూహాలను రూపొందించడానికి భారత్ చేస్తున్న ప్రయత్నాల్లో ఆసుపత్రులు, రాష్ట్ర ప్రభుత్వాలు కరోనా సంబంధిత మరణాలను తప్పుగా చూపడం సహాయపడదని, ఆటంకం ఏర్పడుతుందన్నారు. పలు రాష్ట్రాలు కొవిడ్ మరణాలను తక్కువగా చూపిస్తున్నాయన్న నేపథ్యంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. దీనికి ఇటీవల మధ్యప్రదేశ్లో అధికారిక గణాంకాలు, ఏప్రిల్లో నిర్వహించిన చివరి కర్మల సంఖ్య మధ్య అసమానత ఉండడమే కారణం.
‘ఒక వ్యక్తికి అప్పటికే కరోనా ఉండి గుండెపోటుతో చనిపోతే అప్పుడు కొవిడ్ గుండెపోటుకు కారణం కావచ్చు. మీరు దీన్ని కొవిడ్ మరణమని లేదా నాన్ కొవిడ్గా గుర్తించి గుండెపోటుతో మరణించారని అని తప్పుగా వర్గీకరించవచ్చు.. కాబట్టి, అన్ని ఆస్పత్రులు, రాష్ట్రాలు డెత్ ఆడిట్ చేయవలసిన అవసరం ఉంది. ‘అన్ని ఆసుపత్రులు, రాష్ట్రాలు డెత్ ఆడిట్ చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే మరణాలకు కారణాలు ఏంటీ? మన మరణాల రేటును తగ్గించేందుకు ఏం చేయవచ్చో మనం తెలుసుకోవాలి. మాకు స్పష్టమైన డేటా లేకపోతే.. మేము చేయలేము మా మరణాలను తగ్గించడానికి ఒక వ్యూహాన్ని అభివృద్ధి చేయగలగాలి’ అని అన్నారు.
కొవిడ్ రోగి మరణించాడా ? లేదా? అనే విషయాన్ని ఎవరు నిర్ణయించాలో ఇటీవల కేరళ శాసనసభ ఇటీవల చర్చించిన నేపథ్యంలో ఆయన పేర్కొన్నారు. వ్యాక్సిన్ల మధ్య అంతరంపై ఆయన స్పందిస్తూ ఆస్ట్రాజెనెకా అభివృద్ధి చేసిన కొవిషీల్డ్ వ్యాక్సిన్పై ఇంకా అధ్యయనం కొనసాగుతుందున్నారు. వైద్య సంఘం ప్రస్తుత అవగాహన ప్రకారం.. 12-13 వారాల సమయం ‘సరిపోతుంది’, కొత్త డేటా అందుబాటులోకి వస్తే మార్పులు చోటు చేసుకోవచ్చన్నారు.