హైదరాబాద్, ఏప్రిల్ 1 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలోని రెండు గ్రామ పంచాయతీలు ‘దీన్ దయాళ్ ఉపాధ్యాయ పంచాయతీ సతత్ వికాస్ పురసార్ (డీడీయూపీఎస్వీపీ) -2025కు ఎంపికయ్యాయి. వికారాబాద్ జిల్లా కోటేపల్లి మండలం మోతుకుపల్లి జీపీ ‘గుడ్ గవర్నెన్స్’ విభాగంలో అవార్డు సాధించింది. పారదర్శక పాలన, ప్రజల భాగస్వామ్యం, అభివృద్ధిలో చూపిన ప్రతిభకు గుర్తింపు లభించింది. సంగారెడ్డి జిల్లా సంగారెడ్డి మండలం ఫసల్వాడి గ్రామ పంచాయతీ ‘ఉమెన్ ఫ్రెండ్లీ పంచాయతీ’ విభాగంలో ఎంపికైంది.
మ హిళా సాధికారత, భద్రత, సంక్షేమ కార్యక్రమాల అమల్లో చూపిన కృషికి ఈ అవార్డు దకింది. దేశవ్యాప్తంగా గ్రామీణాభివృద్ధి లక్ష్యాల సాధనలో ముందంజలో ఉన్న పంచాయతీలను గుర్తించి కేంద్రం ఈ అవార్డులు ప్రదానం చేస్తున్నది. తెలంగాణకు అవార్డులు రావడంపై పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ మంత్రి ధనసరి అనసూయ సీతక హర్షం ప్రకటించారు.