నీటి లభ్యత పెరగడంతో తెలంగాణలోనూ చేపల చెరువులు పెరుగుతున్నాయి. పల్లెల్లోనూ సంప్రదాయ చెరువులు, కుంటల్లో భారీగా మత్స్య సంపద వృద్ధి చెందుతున్నది. అయితే, చేప పిల్లలను చెరువులు, కుంటల్లో వదిలే సమయంలో సరైన జాగ్రత్తలు తీసుకోవడం ముఖ్యం. లేకుంటే, చేప పిల్లలు మృత్యువాతపడి, మత్స్యకారులు, రైతులు నష్టపోవాల్సి వస్తుంది.