జిల్లా కేంద్రంతోపాటు వివిధ పట్టణాలు, గ్రామా ల్లో హోలీ వేడుకలను ఘనంగా జరుపుకున్నారు. గురువారం రాత్రి ఆయా చోట్ల కాముని దహనం చేశారు. శుక్రవారం ఉదయం నుంచే చిన్నారులు, యువకులు, మహిళలు రంగులు చల్లుకొని సంబు రాలు జరుపుకున్నారు. యువకులు డప్పుచప్పుళ్లతో శోభాయాత్రగా వెళ్లి ఒకరికొకరు రంగులు చల్లుకు న్నారు. వేడుకల్లో ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు. నిర్మల్లోని క్యాంప్ కార్యాలయంలో ఎస్పీ సీహెచ్ ప్రవీణ్కుమార్ పోలీస్ అధికారులు, సిబ్బందితో కలిసి హోలీ సంబురాల్లో పాల్గొన్నారు.
నిర్మల్ టౌన్/నిర్మల్ అర్బన్, మార్చి 18 : టీఎన్జీవో కార్యాలయంలో జరిగిన హోలీ వేడుక ల్లో టీఎన్జీవో ఉద్యోగులు ప్రభాకర్, రవికుమార్, సురేందర్, ప్రవీణ్కుమార్, రాజేశ్వర్గౌడ్, మోహ న్రెడ్డి పాల్గొన్నారు. రంగులు చల్లుకున్నారు. టీయూటీఎఫ్ కార్యాలయంలో జిల్లా అధ్యక్షుడు లక్ష్మీప్రసాద్రెడ్డి, ప్రధాన కార్యదర్శి రవికాంత్ ఆధ్వర్యంలో వేడుకలు జరిగాయి. నాయకులు ధర్మరాజ్, సునిల్రెడ్డి, ముత్తన్న, ప్రసాద్, నారా యణ, పాల్గొన్నారు. డీఆర్డీఏ ఉద్యోగుల సంఘం ఆధ్వ ర్యంలో రంగులు చల్లుకున్నారు. ఉద్యోగులు ప్రసాద్, సందీప్, సుధాకర్, సురేశ్, తదితరులు పాల్గొన్నారు. వీహెచ్పీ ఆధ్వర్యంలో హోలీ వేడుక లు జరిగాయి. గాంధీచౌక్లో ప్రత్యేక పూజలు చేశా రు. గాంధీ విగ్రహం వద్ద జెండాను ఎగురవేశారు.
నిర్మల్ చైన్గేట్, మార్చి 18 : క్యాంప్ కార్యాల యంలో ఎస్పీ సీహెచ్ ప్రవీణ్కుమార్ పోలీస్ అధి కారులు, సిబ్బందితో కలిసి హోలీ సంబరాల్లో పాల్గొన్నారు. అధికారులు, సిబ్బందికి రంగులు పూసి శుభాకాంక్షలు తెలిపారు. అదనపు ఎస్పీలు రాంరెడ్డి, వెంకటేశ్వర్లు, డీఎస్పీలు ఉపేంద్రరెడ్డి, జీవన్రెడ్డి, ఎస్బీ ఇన్స్పెక్టర్ రమేశ్, సీసీఎస్ ఇన్ స్పెక్టర్ కుమారస్వామి, డీసీఆర్పీ ఇన్స్పెక్టర్ శ్రీని వాస్, సీఐలు శ్రీనివాస్, వెంకటేశ్, రాం నర్సింహా రెడ్డి, ఆర్ఐలు రామకృష్ణ, రమేశ్, ఎంటీవో వినో ద్, ఎస్ఐలు, సిబ్బంది పాల్గొన్నారు.
భైంసా, మార్చి 18 : ఎమ్మెల్యే విఠల్ రెడ్డికి పలువురు హోలీ శుభాకాంక్షలు తెలిపారు. కిసాన్ గల్లి సర్పంచ్ అల్లకొండ సాయినాథ్, ఉప సర్పంచ్ గట్టు, కాశీనాథ్, మాజీ సర్పంచ్లు కుంట రాజ లింగు, కోర్వ చిన్నన్న ఉన్నారు. భైంసాలో ఏఎస్పీ కిరణ్ ఖారే, పట్టణ సీఐ ప్రవీణ్ కుమార్, ఆయా కూడళ్లలో బందోబస్తును ఏర్పాటు చేశారు.
భైంసాటౌన్, మార్చి, 18: మండల ప్రజా ప్రతినిధులు, టీఆర్ఎస్ నాయకులు దేగాంలో ఎమ్మెల్యే విఠల్ రెడ్డిని కలిసి శుభాకాంక్షలు తెలిపా రు. వానల్పాడ్లో ఎంపీపీ కల్పనా జాదవ్ హోలీ వేడుకల్లో పాల్గొన్నారు. రూరల్ పోలీస్స్టేషన్లో ఎస్ఐ శ్రీకాంత్ సిబ్బందిపై రంగులు చల్లారు.
ఖానాపూర్ టౌన్, మార్చి 18 : పట్టణంలో జరిగిన వేడుకల్లో మున్సిపల్ చైర్మన్ అంకం రాజేందర్, హిందూ ఉత్సవ కమి టీ అధ్యక్షుడు రాచమల్ల రాజశేఖర్, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా టీజీవో అధ్యక్షుడు అజ్మీరా శ్యాంనాయక్, నాయ కులు కొక్కుల ప్రదీప్, బండారి కిశోర్, నాగేంద ర్రావు, కిశోర్ నాయక్, కౌన్సిలర్లు, పాల్గొన్నారు.
ఖానాపూర్రూరల్, మార్చి 18 : ఆయా గ్రామాల్లో జరిగిన వేడుకల్లో ఎంపీపీ మొహిద్, కల్వకుంట్ల నారాయణ, గాండ్ల శేఖర్, రాచమల్ల శేఖర్, గడ్డి శ్రీనివాస్, పడాల లక్ష్మీనారాయణ, దాసరి కృష్ణమూర్తి, వసంత్, సాగి లక్ష్మణ రావు, కొక్కుల శేఖర్, శోభన్, చిన్నం రవి, రాజేశ్వర్ తదితరులు పాల్గొన్నారు.
పెంబి, మార్చి 18 : మండల కేంద్రంలో ప్రజలు గురువారం రాత్రి కాముని దహనం నిర్వ హించారు. సంబురాల్లో సర్పంచ్ పూర్ణచందర్ గౌడ్, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు సల్లా నరేం దర్ రెడ్డి, నాయకులు గాండ్ల శంకర్, పుప్పాల మల్లేశ్, రాజేందర్, సుతారి మహేందర్, నారాయ ణ, చిన్నయ్య, భూమేశ్, రాజన్న పాల్గొన్నారు.
దస్తురాబాద్, మార్చి 18 : ఆయా గ్రామాల్లో ఎంపీపీ సింగరి కిషన్ హోలీ సంబురాల్లో పాల్గొ న్నారు. సర్పంచ్లు, నాయకులు రంగులు చల్లుకు న్నారు. గొడిసెర్యాల గోండు గూడ (జీ),మున్యాల గోండు గూడెంతోపాటు తదితర గ్రామాల్లో ఆదివాసీలు కాముని దహన కార్యక్రమాన్ని నిర్వహించారు.
కుభీర్, మార్చి 18 : దేగాంలోని ఎమ్మెల్యే నివాసానికి వెళ్లిన పలువురు టీఆర్ఎస్ నాయకు లు ఎమ్మెల్యే విఠల్రెడ్డికి రంగులద్ది స్వీట్లు తిని పించి శుభాకాంక్షలు తెలిపారు.
లోకేశ్వరం, మార్చి 18 : టీఆర్ఎస్ నాయకు లు లోలం శ్యాంసుందర్, ఎంపీపీ లలితా భోజ న్న, టీఆర్ఎస్ మండల కన్వీనర్ కరిపే శ్యాం సుందర్ ఎమ్మెల్యే విఠల్రెడ్డికి హోలీ శుభాకాం క్షలు తెలిపారు. చిన్నా, పెద్ద తేడా లేకుండా డీజే పాటలతో నృత్యాలు చేస్తూ ఆనందోత్సహాల మధ్య సంబురాలు జరుపుకున్నారు.