న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా సంచలనం రేపిన శ్రద్ధావాకర్ హత్యకేసులో నిందితుడు ఆఫ్తాబ్ అమిన్ పూనావాలా పాలీగ్రాఫ్ టెస్ట్ సందర్భంగా విస్తుగొల్పే వ్యాఖ్యలు చేశాడు. తనను ఉరితీసినా బాధపడనని, స్వర్గంలో తనకు దేవకన్య లభిస్తుందని పేర్కొన్నాడు. ఢిల్లీలోని రోహిణిలోగల ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీలో ఆఫ్తాబ్కు పాలీగ్రాఫ్ టెస్ట్ నిర్వహించారు. ఈ పరీక్షలో సంచలన విషయాలు వెల్లడించాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. తాను శ్రద్ధాతో సంబంధంలో ఉన్న సమయంలోనే 20 మంది హిందూ యువతులతో అఫైర్స్ పెట్టుకున్నట్టు చెప్పాడు. బంబుల్ యాప్ ద్వారా హిందూ యువతులను లక్ష్యంగా చేసుకొనేవాడినని, వారిని ట్రాప్లో పడేసేవాడినని వివరించాడు. శ్రద్ధాను చంపి, ముక్కలు ముక్కలుగా నరికినందుకు తనకు బాధ కలుగలేదని చెప్పాడు. ప్రశ్నప్రశ్నకు అతడు నిద్రపోయాడు. శ్రద్ధావాకర్ను ముంబైలోనే హత్యచేసి, ముక్కలుముక్కలుగా నరకాలనేది తన ప్లాన్ అని చెప్పాడు. ఈ విషయాలను నార్కో టెస్ట్ తర్వాతే పోలీసులు అధికారికంగా వెల్లడించే అవకాశం ఉంది.