Hero MotoCorp |దేశంలోకెల్లా అతిపెద్ద టూ వీలర్స్ సంస్థ హీరో మోటో కార్ప్ వచ్చేనెలలో ఈవీ సెగ్మెంట్లోకి ఎంటర్ కానున్నది. తన తొలి మోడల్ టూ వీలర్ను `విదా` బ్రాండ్ కింద మార్కెట్లోకి తేనున్నది. మొబిలిటీ రంగంలో నూతన అధ్యాయం ప్రారంభం కానున్నదని హీరో మోటో కార్ప్ తన క్వార్టర్లీ రిపోర్ట్లో వెల్లడించింది. విదా బ్రాండ్ కింద తొలి ఎలక్ట్రిక్ బైక్ లేదా స్కూటర్ మార్కెట్లో అందుబాటులోకి రానున్నదని తెలిపింది. వచ్చే నెల ఏడో తేదీన తొలి వెహికల్ను ఆవిష్కరిస్తారు.
విదా బ్రాండ్ కింద మార్కెట్లో ఎలక్ట్రిక్ టూ వీలర్ ఆవిష్కరణ కార్యక్రమం భారీ స్థాయిలో చేపట్టింది హీరో మోటో కార్ప్. డీలర్లు, ఇన్వెస్టర్లు, గ్లోబల్ డిస్ట్రిబ్యూటర్లకు ఈ మేరకు ఆహ్వానాలు పంపింది. రాజస్థాన్ రాష్ట్ర రాజధాని జైపూర్లో ఈవీ టూవీలర్ ఆవిష్కరణ జరుగనున్నదని కంపెనీ వర్గాలు తెలిపాయి.
తమ ఎలక్ట్రిక్ వెహికల్స్తోపాటు ఈఎస్జీ సొల్యూసన్స్ కోసం పదివేల మంది ఎంటర్ప్రెన్యూర్లకు శిక్షణ ఇచ్చేందుకు సుమారు 760 కోట్ల గ్లోబల్ ఫండ్ కేటాయిస్తున్నట్లు ఈ ఏడాది మార్చిలో హీరో మోటో కార్ప్ ప్రకటించింది. జైపూర్ కేంద్రంగా పని చేస్తున్న ఆర్ అండ్ డీ హబ్లో విదా టూ వీలర్ డిజైన్ చేస్తారు. ఆంధ్రప్రదేశ్లోని చిత్తూర్ కేంద్రంగా పని చేస్తున్న ప్రొడక్షన్ యూనిట్లో ఈవీ టూ వీలర్ను ఉత్పత్తి చేయనున్నది.