న్యూఢిల్లీ: తమ వాహనాలకు ఆర్థిక సేవలు అందించడంలో భాగంగా బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్బీఐ)తో జతకట్టింది హీరో ఎలక్ట్రిక్. దేశీయంగా ఎలక్ట్రిక్ వాహనాలకు డిమాండ్ అంతకంతకు పెరుగుతున్నదని, దీంతో కొనుగోలుదారులకు ఆర్థికంగా సేవలు అందించాలనే ఉద్దేశంతో ఎస్బీఐతో ఒప్పందం కుదుర్చుకున్నట్లు కంపెనీ ఒక ప్రకటనలో తెలిపింది. ఇరు సంస్థల మధ్య జరిగిన ఒప్పందం ప్రకారం హీరో ఈవీల కొనుగోలు చేసిన వారికి తక్కువ వడ్డీకే రుణం లభించనున్నది. యోనో యాప్ ద్వారా హీరో ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాన్ని కొనుగోలు చేసిన వారికి రూ.2 వేల వరకు రాయితీ కూడా ఇస్తున్నది బ్యాంక్.