బేగంపేట్ : పేదరికం కారణంగా సరైన వైద్య చికిత్సలు చేయించుకోలేక తీవ్ర ఇబ్బందులు పడుతున్న అనేక మందిని ముఖ్యమంత్రి సహాయ నిధి ఆదుకుంటుందని రాష్ట్ర పశుసంవర్థక శాఖ, పాడిపరిశ్రమల అభివృద్ధి మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. సోమవారం మారేడ్పల్లిలోని తన నివాసంలో బేగంపేట్ దేవుడి బస్తీకి చెందిన ఖలీల్ఖాన్కు ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి మంజూరైన 2లక్షల ఎల్వోసి ఆర్థిక సహాయ మంజూరు పత్రాన్ని స్థానిక కార్పొరేటర్ మహేశ్వరితో కలిసి అందించారు.
కొంత కాలంగా కిడ్నీ వ్యాధితో బాధపడుతున్న ఖలీల్ఖాన్కు నిమ్స్ ఆసుపత్రిలో వైద్య పరీక్షలు నిర్వహించిన వైద్యులు చికిత్స చేయాలని చెప్పారు. దీంతో ఆర్థిక సహాయం కోసం మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ను కలిసి పరిస్థితి వివరించి ఆదుకోవాలని కోరాడు. స్పందించిన మంత్రి తలసాని ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి 2 లక్షలు మంజూరు చేయించి అందించారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ నాయకులు శ్రీహరి, శ్రీనివాస్ గౌడ్, శేఖర్ ముదిరాజ్, మాజీ కార్పొరేటర్ ఉప్పల తరుణి తదితరులు పాల్గొన్నారు.