బెంగళూరు : భారీ వర్షాల కారణంగా ఇల్లు కూలిన ఘటనలో ఏడుగురు దుర్మరణం పాలయ్యారు. ఈ విషాదకర ఘటన కర్ణాటక బెల్గాం తాలూకాలో బుధవారం చోటు చేసుకున్నది. ఘటనలో ఏడు సంవత్సరాల చిన్నారితో సహా ఒకే కుటుంబానికి చెందిన ఏడుగురు మరణించారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది అక్కడికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. శిథిలాల నుంచి ముగ్గురిని తరలించారు. సంఘటనా స్థలంలోనే ఐదుగురు మృతి చెందగా.. ఇద్దరు చికిత్స కోసం ఆసుప్రతికి తరలిస్తుండగా మరణించారు. హెరెబాగేవాడి పోలీసులు ఘటనపై కేసు నమోదు చేశారు.