ఖలీల్వాడి, మే 13 : ఓ మెడికో 27 ఏండ్లకే గుండెపోటుతో ప్రాణాలు వదిలింది. ఈ ఘటన నిజామాబాద్లో శుక్రవారం చోటుచేసుకొన్నది. స్థానిక వైద్య కళాశాలలో పీజీ రెండో సంవత్సరం చదువుతున్న కరీంనగర్ జిల్లాకు చెందిన శ్వేత (27) ప్రభుత్వ దవాఖానలో విధులు నిర్వహిస్తున్నారు. పీజీ విద్యార్థులు రోగులకు సేవలందించి విశ్రాంతి తీసుకొంటున్నారు. ఈ క్రమంలో తెల్లవారుజాము 3 గంటల ప్రాంతంలో కరీంనగర్ జిల్లాకు చెందిన శ్వేత గుండెపోటుతో మరణించారు.