అహ్మదాబాద్ : గుజరాత్ అంక్లేశ్వర్లోని భారత్ బయోటెక్ కొత్త ప్లాంట్లో పంపిణీకి సిద్ధంగా ఉన్న కొవాగ్జిన్ తొలిబ్యాచ్ టీకాలను కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ ఆదివారం విడుదల చేశారు. అంక్లేశ్వర్ పర్యటనలో భారత్ బయోటెక్ యూనిట్ను ఆయన సందర్శించారు. ‘కరోనాపై పోరాటంలో వ్యాక్సినేషన్ వేగవంతం చేయడమే చాలా ముఖ్యం’ అంటూ ట్వీట్ చేశారు. గుజరాత్లోని అంక్లేశ్వర్ ప్లాంట్తో దేశంలో వ్యాక్సిన్ సరఫరా పెరగడంతో పాటు ప్రతి భారతీయుడికీ టీకా అందించాలన్న తమ లక్ష్యం నెరవేరుతుందని కేంద్రమంత్రి ఆశాభావం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో భారత్ బయోటెక్ ఎండీ, చైర్మన్ కృష్ణ ఎల్ల, ఆయన సతీమణి, జేఎండీ సుచిత్ర ఎల్ల పాల్గొన్నారు. ఇదిలా ఉండగా.. కొవాగ్జిన్ టీకాల తయారీకి అంక్లేశ్వర్లోని యూనిట్కు ఈ నెల 10న కేంద్ర ప్రభుత్వం అనుమతులు ఇచ్చింది. ప్లాంట్లో మొత్తం 20 కోట్ల డోసులను ఉత్పత్తి చేయనున్నట్లు కంపెనీలో మేలో ప్రకటించింది.