న్యూఢిల్లీ, ఫిబ్రవరి 2: మార్ట్గేజ్ రుణాలు అందించే దేశంలో అతిపెద్ద సంస్థ హెచ్డీఎఫ్సీ ఆశాజనక ఆర్థిక ఫలితాలు ప్రకటించింది. డిసెంబర్తో ముగిసిన మూడు నెలల కాలానికిగాను సంస్థ రూ.5,837 కోట్ల కన్సాలిడేటెడ్ నికర లాభాన్ని గడించింది. అంతక్రితం ఏడాది ఇదే త్రైమాసికంలో నమోదైన రూ.5,177 కోట్లతో పోలిస్తే 13 శాతం అధికమని పేర్కొంది. సమీక్షకాలంలో కంపెనీ ఆదాయం రూ.39,268 కోట్ల నుంచి రూ.31,308 కోట్లకు తగ్గినట్లు బీఎస్ఈకి సమాచారం అందించింది. సెప్టెంబర్ త్రైమాసికంలో నమోదైన రూ.38,604 కోట్లతో పోలిస్తే కూడా భారీగా తగ్గింది. ఏకీకృత విషయానికి వస్తే కంపెనీ నికర లాభం ఏడాది ప్రాతిపదికన 11 శాతం పెరిగి రూ.3,261 కోట్లుగా నమోదైంది.