అతని పేరు విద్యుత్ జయసింహ.. మహిళా క్రికెట్ టీమ్కు హెడ్కోచ్గా ఆయన ఉద్యోగం.. జీతం 20 లక్షల రూపాయలు… ఆయన చేసేపనులు మాత్రం అత్యంత నీచంగా ఉంటాయి. నిత్యం తాగడం, క్రికెట్ ఆడే అమ్మాయిలను లైంగికంగా వేధించటం ఆయన చేసే పనులు. ఇదేంటని ప్రశ్నించినవారిని టార్గెట్ చేయడం, టీంలోనుంచి తీసేస్తానని బెదరించడం.. ఇదీ హెడ్ కోచ్ జయసింహ చేస్తున్న పని. ఆయన పాపం పండిందో లేక అతని ఘనకార్యాలు బయటికి పొక్కడంతో అధికారులు దిద్దుబాటు చర్యలు తీసుకున్నారో తెలియదు కానీ.. జయసింహ సస్పెండయ్యాడు. ఇంతకు ఈ పెద్ద మనిషి ఎలా దొరికిపోయాడంటే…
బస్సులో జయసింహ తాగుతున్న వీడియో
Hyderabad Senior Women’s team coach Vidyuth Jaisimha was allegedly found carrying and drinking #alcohol on the team bus.#Hyderabad #Cricket Association, asks the head coach to refrain from HCA cricketing activities until an investigation is carried out.#BCCI #HCA pic.twitter.com/ORaOyPMyBt
— Surya Reddy (@jsuryareddy) February 16, 2024
HCA : హైదరాబాద్ మహిళల జట్టు హెడ్కోచ్ విద్యుత్ జై సింహ(Vidyut Jai Simha)పై వేటు పడింది. ఉమెన్స్ టీమ్ ప్రయాణిస్తున్న బస్సులో మద్యం సేవించి క్రికెటర్లను వేధింపులకు గురి చేసిన అతడిని హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్(HCA) సస్పెండ్ చేసింది. కావాలనే విమానం మిస్ చేసి, బస్సులో ప్రయాణించేలా చేసి కూల్ డ్రింక్ బాటిల్లో మద్యం నింపుకుని బస్సులో తాగుతూ మహిళా క్రికెటర్లను వేధింపులకు గురిచేసిన వీడియో ఒకటి బయటకు లీకయింది. ఈ దృశ్యాలు వాట్సాప్ గ్రూపులు, టీవీ చానెళ్లలో వైరల్ అయ్యాయి. దాంతో, అతడిపై తక్షణమే వేటు వేస్తున్నట్టు హెచ్సీఏ అధ్యక్షుడు జగన్మోహన్ రావు (Jaganmohan Rao) ఓ ప్రకటనలో తెలిపారు.
‘జై సింహ మద్యం సేవించిన ఘటనపై సమగ్ర దర్యాప్తునకు ఆదేశించాం. అనంతరం అతడిపై చర్యలు తీసుకుంటాం. మహిళా క్రికెటర్లపై వేధింపులకు పాల్పడితే క్రిమినల్ చర్యలు తీసుకుంటాం. ఇలాంటి చర్యలను ఎట్టి పరిస్థితుల్లోనే ఉపేక్షించేది లేదు. విచారణ ముగిసేంతవరకు జై సింహను సస్పెండ్ చేస్తున్నాం’ అని జగన్ వెల్లడించారు.
హెచ్సీఏ అధ్యక్షుడు జగన్మోహన్ రావు