రాంచీ: భారత యువ ఓపెనర్ షఫాలీ వర్మ (23 బంతుల్లో 50; 7 ఫోర్లు, 3 సిక్సర్లు) మెరుపు అర్ధశతకంతో చెలరేగడంతో సీనియర్ మహిళల టీ20 టోర్నీలో హర్యానా జట్టు బోణీ కొట్టింది. సోమవారం పంజాబ్తో జరిగిన మ్యాచ్లో హర్యానా 3 వికెట్ల తేడాతో విజయం సాధించింది. మొదట బ్యాటింగ్ చేసిన పంజాబ్ నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 155 పరుగులు చేసింది. కెప్టెన్ హర్మన్ప్రీత్ కౌర్ (38 బంతుల్లో 64 నాటౌట్; 7 ఫోర్లు, 3 సిక్సర్లు) దంచికొట్టగా.. ప్రగతి సింగ్ (36) ఆమెకు సహకరించింది. అనంతరం లక్ష్యఛేదనకు దిగిన హర్యానా 19.2 ఓవర్లలో 7 వికెట్లకు 158 పరుగులు చేసింది. షఫాలీ ఇన్నింగ్స్కు గట్టి పునాది వేయగా.. సుమన్ గులియా (31), మాన్సీ జోషి (25 నాటౌట్) జట్టును గెలుపు తీరాలకు చేర్చారు.