కాంటర్బ్యూరీ: భారత మహిళల కెప్టెన్ హర్మన్ప్రీత్కౌర్ అదరగొట్టింది. బుధవారం ఇంగ్లండ్తో జరిగిన రెండో వన్డేలో కౌర్(111 బంతుల్లో 143 నాటౌట్, 18 ఫోర్లు, 4 సిక్స్లు) అజేయ సెంచరీతో కదం తొక్కింది.
కౌర్ సెంచరీకి తోడు హర్లీన్ డియోల్(58) అర్ధసెంచరీతో భారత్ నిర్ణీత 50 ఓవర్లలో 333/5 స్కోరు చేసింది. తర్వాత లక్ష్యఛేదనకు దిగిన ఇంగ్లండ్..30 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 168 పరుగులు చేసింది. రేణుకా సింగ్ మూడు వికెట్లు పడగొట్టింది.