ముంబై: భారత ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యాకు సంబంధించిన వాచ్లను ముంబై ఎయిర్పోర్టులో కస్టమ్స్ అధికారులు సీజ్ చేశారు. దుబాయ్ నుంచి భారత్కు సోమవారం ఉదయం హార్దిక్ తిరిగొచ్చాడు. ముంబై ఎయిర్పోర్టులో దిగిన పాండ్యా లగేజీని పరిశీలించిన కస్టమ్స్ అధికారులు రెండు ఖరీదైన వాచ్లను గుర్తించారు. అయితే వాటి విలువ రూ.5 కోట్లు అని వార్తలు రావడంతో హార్దిక్ ట్విటర్ వేదికగా వివరణ ఇచ్చాడు. ‘వాచ్ల విలువ రూ.కోటిన్నర మాత్రమే! నేను చట్టాలను.. ప్రభుత్వ వ్యవస్థలను గౌరవించే వ్యక్తిని’ అని స్పష్టం చేశాడు. ‘దుబాయ్ నుంచి తెచ్చిన వస్తువులతో నేను నేరుగా ముంబై ఎయిర్పోర్టులోని కస్టమ్స్ అధికారుల వద్దకు వెళ్లాను. చట్టపరంగా కొనుగోలు చేసిన వస్తువులకు వాళ్లు చెప్పిన కస్టమ్స్ డ్యూటీ చెల్లించి తీసుకున్నా. నాపై వచ్చిన ఆరోపణలన్నీ నిరాధారం’ అని హార్దిక్ వివరణ ఇచ్చాడు.