పోచమ్మమైదాన్, మార్చి 12: ఓరుగల్లు చేనేత ఉత్పత్తులకు నిలయమైన కొత్తవాడను కర్ణాటకకు చెందిన విద్యార్థులు సందర్శించారు. బెంగళూర్లోని శ్రీష్టి మనిపాల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆర్ట్, డిజైన్ అండ్ టెక్నాలజీకి చెందిన 18 మంది విద్యార్థులు శనివారం వరంగల్ జిల్లాలో పర్యటించారు. కొత్తవాడలోని నేత కార్మికుల ఇండ్లను సందర్శించి చేనేత ఉత్పత్తులను పరిశీలించారు. అంతర్జాతీయ స్థాయిలో డిమాండ్ ఉన్న దర్రీస్ను చూసి ఆకర్షితులై వాటి తయారీ విధానాన్ని అడిగి తెలుసుకొన్నారు. దర్రీస్తోపాటు కలంకారి, డైయింగ్ తయారీని ప్రత్యక్షంగా చూశారు.