హైదరాబాద్, ఫిబ్రవరి 9: హిందుజా గ్రూపునకు చెందిన జీవోసీఎల్ కార్పొరేషన్ నిరాశాజనక ఆర్థిక ఫలితాలు ప్రకటించింది. 2021-22 ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికానికిగాను రూ.138 కోట్ల కన్సాలిడేటెడ్ ఆదాయంపై రూ.7 కోట్ల నికర లాభాన్ని గడించింది. ప్రస్తుతం సంస్థ వద్ద రూ.820 కోట్ల విలువైన పలు ఆర్డర్లు ఉన్నాయి. మరోవైపు, హైదరాబాద్లో ఉన్న 44 ఎకరాల స్థలాన్ని విక్రయించడంతో రూ.451 కోట్ల నిధులు సమకూరాయి. వీటిలో మూడో విడుత కింద రూ.112 కోట్ల నిధులు వచ్చాయని తెలిపింది.