చాంబర్ను ప్రారంభించిన గుత్తా సుఖేందర్రెడ్డి
హైదరాబాద్, మార్చి 15 (నమస్తే తెలంగాణ): తెలంగాణ శాసనమండలిలో తన నూతన చాంబర్ను చైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డి ప్రారంభించారు. కొత్త చాంబర్లో మంగళవారం ఆయన ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం చైర్మన్ సుఖేందర్రెడ్డిని మిగతా ఎమ్మెల్సీలు కుర్చీలో కూర్చోబెట్టారు. కార్యక్రమంలో ప్రభుత్వ విప్ ఎమ్మెస్ ప్రభాకర్రావు, ఎమ్మెల్యే భాస్కర్రావు, ఎమ్మెల్సీ తక్కెళ్లపల్లి రవీందర్రావు, అసెంబ్లీ కార్యదర్శి డాక్టర్ నరసింహచార్యులు, నల్లగొండ జడ్పీ ఫ్లోర్ లీడర్ పాశం రాంరెడ్డి, గుత్తా తనయుడు అమిత్రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
గుత్తాకు మంత్రి ఎర్రబెల్లి అభినందనలు
శాసనస మండలి చైర్మన్గా రెండోసారి ఏకగ్రీవంగా ఎన్నికైన గుత్తా సుఖేందర్రెడ్డికి రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు శుభాకాంక్షలు తెలిపారు. శాసనమండలిలో మంగళవారం ప్రత్యేక చర్చ సందర్భంగా మంత్రి ఎర్రబెల్లి మాట్లాడుతూ.. సుఖేందర్రెడ్డి తనకు 30 ఏండ్లుగా తెలుసని, ఆయన సుదీర్ఘంగా రాజకీయాల్లో ఉన్నారని, మూడుసార్లు ఎంపీగా, రెండుసార్లు ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారని పేర్కొన్నారు. రెండుసార్లు మండలి చైర్మన్గా ఏకగ్రీవంగా కావడం వారి ప్రతిభకు, సమర్థతకు నిదర్శనమన్నారు. గుత్తాకు అవకాశం కల్పించిన సీఎం కేసీఆర్కు కృతజ్ఞతలు తెలిపారు.