న్యూఢిల్లీ: భారత యువ గ్రాండ్ మాస్టర్ గుకేశ్.. లా రోడా అంతర్జాతీయ ఓపెన్ చెస్ టోర్నీలో విజేతగా నిలిచాడు. వరుస విజయాలతో దూసుకెళ్తున్న ఈ యువకెరటం స్పెయిన్ వేదికగా జరిగిన టోర్నీలో సత్తా చాటాడు. ఓటమెరుగకుండా తొమ్మిది రౌండ్లను పూర్తి చేసుకున్న చెన్నై చిన్నోడు ఎనిమిది పాయింట్లతో చాంపియన్గా అవతరించాడు.
ఆఖరి పోరులో విక్టర్ మిఖేలెవ్స్కీ (ఇజ్రాయెల్)ను చిత్తు చేసి టైటిల్ను తన ఖాతాలో వేసుకున్నాడు. టోర్నీలో మొత్తం ఏడు విజయాలు, రెండు ‘డ్రా’లతో ఈ టోర్నీని గుకేశ్ ఘనంగా ముగించాడు. 7.5 పాయింట్లతో హేక్ మార్టిరోస్యాన్ రెండో స్థానంలో నిలువగా.. భారత గ్రాండ్మాస్టర్ ఆర్ ప్రజ్ఞానంద 7 పాయింట్లతో మూడో స్థానం కైవసం చేసుకున్నాడు.