న్యూఢిల్లీ: ఐపీఎల్లో కొత్తగా అడుగుపెట్టిన అహ్మదాబాద్ ఫ్రాంచైజీ తమ జట్టు పేరును ‘గుజరాత్ టైటాన్స్’గా నామకరణం చేసింది. ఈ మేరకు బుధవారం టీమ్ పేరును వెల్లడిస్తూ ‘శుభ్ ఆరంభ్’అని ట్వీట్ చేసింది. సీవీసీ గ్రూప్ రూ. 5625 కోట్లు పెట్టి కొనుగోలు చేసిన ఈ జట్టుకు స్టార్ ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యా కెప్టెన్గా వ్యవహరించనుండగా.. భారత మాజీ పేసర్ నెహ్రా కోచింగ్ బాధ్యతలు చూసుకోనున్నాడు. మెగా వేలానికి ముందు గుజరాత్ టైటాన్స్ హార్దిక్తో పాటు అఫ్గానిస్థాన్ స్టార్ స్పిన్నర్ రషీద్ ఖాన్, యువ ఓపెనర్ శుభ్మన్ గిల్తో ఒప్పందాలు కుదుర్చుకుంది. ప్రపంచకప్ నెగ్గిన కోచ్ గ్యారీ కిర్స్టన్ ఈ జట్టుకు మెంటార్, బ్యాటింగ్ కోచ్గా.. విక్రమ్ సోలంకీ డైరెక్టర్ ఆఫ్ క్రికెట్గా వ్యవహరించనున్నారు.