అహ్మదాబాద్: కేవలం వివాహ ధ్రువీకరణ సర్టిఫికెట్ ఉన్నంత మాత్రాన ఆ పెండ్లి చెల్లుబాటు కాదని గుజరాత్ హైకోర్టు తీర్పు చెప్పింది. హిందూ వివాహ చట్టం ప్రకారం ఆచారాలకు అనుగుణంగా పెండ్లి క్రతువులు నిర్వహించినప్పుడు మాత్రమే దానికి చట్టబద్ధమైన గుర్తింపు ఉంటుందని న్యాయస్థానం స్పష్టం చేసింది.
ఏ సమాజాలలో నైతే సప్తపది (అగ్ని సాక్షిగా ఏడు అడుగులు) ఆచారం అమల్లో ఉందో అక్కడ ఆ తంతు తప్పనిసరిగా నిర్వహించాలని, అది చేయకపోతే ఆ వివా హం చెల్లుబాటు కాదని పేర్కొన్నది. అప్పటికే జరిగిపోయిన వివాహానికి ఇచ్చే పెండ్లి సర్టిఫికెట్ కేవలం ఒక పత్ర రూప సాక్ష్యం మాత్రమేనని, ఆచారాలు లేని పెండ్లి చెల్లదని బెంచ్ తెలిపింది.