తిరువనంతపురం : వధూవరులను ఆశీర్వదించి విందు ఆరగించి వెళ్లాల్సిన అతిధులు డైనింగ్ హాల్లో బాహాబాహీకి దిగారు. భోజనంలో వడ్డించే అప్పడం కోసం అతిధులు రెండు వర్గాలుగా చీలి ఘర్షణకు దిగడంతో రూ 1.5 లక్షల విలువైన వస్తువులు ధ్వంసమయ్యాయి. కేరళలోని అలప్పుజలోని ఓ వివాహ విందులో ఆదివారం మద్యాహ్నం అప్పడం కోసం జగడం జరిగింది.
పెండ్లి విందులో వరుడి స్నేహితుల్లో ఓ వ్యక్తి మరో అప్పడం వేయాలని కోరగా సర్వర్ నిరాకరించాడు. దీంతో వాగ్వాదం చెలరేగడంతో పెండ్లికి వచ్చిన అతిధులు రెండు గ్రూపులుగా విడిపోయి ఘర్షణకు దిగారు. చైర్లు, టేబుల్స్తో ఒకరిపై ఒకరు దాడులు చేసుకున్నారు. ఘర్షణలో ముగ్గురు వ్యక్తులకు గాయాలయ్యాయి.
In the great 100% literate state of Kerala, a fist fight broke out at a wedding after friends of the bridegroom demanded papad during the feast. This triggered a verbal spat and ended up in an ugly brawl. No wonder Mallus belo papad. 😆 pic.twitter.com/HgkEUYMwfy
— Rakesh Krishnan Simha (@ByRakeshSimha) August 29, 2022
గొడవకు దిగిన ఇరు వర్గాలను శాంతింపచేసేందుకు తలదూర్చిన ఆడిటోరియం యజమాని మురళీధరన్ (74)కూ గాయాలయ్యాయి. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. అప్పడం చుట్టూ సోషల్ మీడియాలో ట్రోల్స్, మీమ్స్ హోరెత్తాయి.