న్యూఢిల్లీ, ఏప్రిల్ 13: గడిచిన పదేండ్లలో దేశంలో స్థూల ప్రత్యక్ష పన్ను వసూళ్లు 173 శాతం, నికర ప్రత్యక్ష పన్ను వసూళ్లు 160 శాతం చొప్పున పెరిగాయి. ఈ మేరకు గురువారం విడుదలైన కేంద్ర ప్రభుత్వ గణాంకాలు తేటతెల్లం చేస్తున్నాయి. కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు (సీబిడీటీ) వివరాల ప్రకారం 2013-14లో స్థూల ప్రత్యక్ష పన్ను వసూళ్లు రూ.7,21,604 కోట్లుగా ఉంటే.. గత ఆర్థిక సంవత్సరం (2022-23) రూ.19,68,780 కోట్లు (అంచనా)గా ఉన్నాయి.
దీంతో 172.83 శాతం పెరుగుదల కనిపించింది. నికర ప్రత్యక్ష పన్ను వసూళ్లలోనూ 160.17 శాతం పెరుగుదల ఉండ గా, రూ.6,38,596 కోట్ల నుంచి రూ.16,61,428 కోట్లకు చేరాయి. అయితే గడిచిన పదేండ్లలో పెరిగిన పన్నుల భారం కూడా ఈ స్థాయి వసూళ్లకు కారణమయ్యాయన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయిప్పుడు.