వ్యవసాయ యూనివర్సిటీ: ప్రొ.జయశంకర్ తెలంగాణ రాష్ట్ర ,వ్యవసాయ విశ్వవిద్యాలయం పరిధిలోని, సంగారెడ్డి వ్యవసాయ ఇంజనీరింగ్ కళాశాల గ్రీన్ ఛాంపియన్ అవార్డుకు ఎంపికైంది. కాగా దేశంలో ప్రతిష్టాత్మకమైన గ్రీన్ ఛాంపియన్ అవార్డుకు ఎంపిక కావడం పట్ల యూనివర్సిటీ ఉపకులపతి డా. వి.ప్రవీణ్ రావు హర్షం వ్యక్తం చేశారు. బుధవారం తన కార్యాలయంలో సంగారెడ్డి కళాశాల సిబ్బందిని అభినందించారు.
దేశంలోని ఉన్నత విద్యాసంస్ధలలో స్వచ్ఛత, వాటర్ మేనేజ్మెంట్, శానిటేషన్, వేస్ట్మేనేజ్మేంట్ అలాగే వివిధ సామాజిక కార్యక్రమాల అమలు తీరును బట్టి గ్రీన్ ఛాంపియన్ అవార్డుకు ఎంపిక చేస్తారని తెలిపారు. ఈ అవార్డును మహాత్మాగాంధి నేషనల్ కౌన్సిల్ ఆఫ్ రూరల్ ఎడ్యుకేషన్ ఆధ్వర్యంలో ఈ నెల 15న సంగారెడ్డి జిల్లా కలెక్టర్ చేతుల మీదుగా అందజేశారన్నారు. ఈసందర్భంగాఎన్.ఎస్.ఎస్ కార్యక్రమ అధికారులు డా.పి.రమేష్ , డా. డి.అనిల్ లను బుధవారం రాజేంద్ర నగర్ పరిపాలన భవనంలో అభినందించారు. రిజిస్ట్రార్ డా. ఎస్.సుధీర్మార్, డిఎస్ఏ డా.జె.సత్య నారాయణ,డీన్ ఆఫ్ అగ్రికల్చర్ ఇంజనీరింగ్ డా.సీమ పాల్గొన్నారు.