హైదరాబాద్, డిసెంబర్ 23: హైదరాబాద్ కేంద్రం గా కార్యకలాపాలు అందిస్తున్న గ్రాన్యూల్స్ నాన్-ఎగ్జిక్యూటివ్ ఇండిపెండెంట్ డైరెక్టర్గా సుచరితా రావు నియమితులయ్యారు. ఈ నియామకం వెంటనే అమలులోకి రానున్నది. గతంలో టెక్ మహీంద్రా మానవ వనరుల గ్లోబల్ హెడ్గా పనిచేశారు. ఐటీ, ఆర్థిక సేవల రంగంలో ఆమెకు 20 ఏండ్లకుపైగా అనుభవం ఉన్నది.