నవాబ్పేట, డిసెంబర్ 1 : మండలంలోని లింగంపల్లి, కూచూర్, కొల్లూరు, లోకిరేవు గ్రామాల్లో ధాన్యం కొనుగోళ్లు జోరుగా సాగుతున్నాయి. రెండురోజుల నుంచి వా తావరణం అనుకూలిస్తుండడంతో వరి కోతలతోపాటు, కొనుగోళ్లు సైతం ఊపందుకున్నాయి. లింగంపల్లి, లోకిరేవు, కొల్లూరు గ్రామాల్లో మహిళా సంఘాల ఆధ్వర్యంలో.. కూచూర్లో సింగిల్విండో ఆధ్వర్యంలో ధా న్యాన్ని కొనుగోలు చేస్తున్నారు. లింగంపల్లి లో బుధవారం నాటి కి 8,200 బస్తాల ధా న్యం కొనుగోలు చేసిన ట్లు మహిళా సంఘం అధ్యక్షురాలు లక్ష్మ మ్మ తెలిపారు. ఇప్పటివరకు 9 లారీల ధా న్యాన్ని లిఫ్ట్ చేసినట్లు వివరించారు. అలాగే లోకిరేవులో 2వేల బస్తా లు, కొల్లూరులో 3వేల బస్తాలు, కూచూర్లో 1500 బస్తాల ధాన్యం కొనుగోలు చేసినట్లు నిర్వాహకులు తెలిపారు. అలాగే పో మాల, చౌడూర్, గురుకుంట, నవాబ్పేట తదితర గ్రామాల్లో ఏర్పాటు చేసిన కేంద్రా ల్లో త్వరితగతిన ధాన్యం కొనుగోలు చేసేందుకు చర్యలు చేపడుతున్నట్లు ఏపీఎం రాంబాబు తెలిపారు.
దళారులను నమ్మి మోసపోవద్దు
మహ్మదాబాద్, డిసెంబర్ 1 : ధాన్యాన్ని విక్రయించేందుకు రైతులు దళారులను ఆశ్రయించి మోసపోవద్దని ఎంపీపీ మాధవి, జెడ్పీటీసీ శ్రీనివాస్రెడ్డి అన్నారు. మండలంలోని దేశాయిపల్లిలో బుధవారం ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ధాన్యం విక్రయించేందుకు ఇబ్బందులు పడొద్దన్న ఉద్దేశంతో ప్రభుత్వం రైతులకు అందుబాటులో కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసిందన్నారు. కొనుగోలు కేంద్రాల్లో రైతులకు మ ద్దతు ధర వస్తుందని, సమీప గ్రామాల రైతు లు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో సర్పంచ్ రాఘవేంద ర్, పీఏసీసీఎస్ వైస్చైర్మన్ లక్ష్మీనారాయణ, జూలపల్లి సర్పంచ్ కిరణ్కుమార్రెడ్డి, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు భిక్షపతి ఉన్నారు.
నాణ్యమైన ధాన్యం తీసుకురావాలి
భూత్పూర్, డిసెంబర్ 1 : రైతులు నాణ్యమైన ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాలకు తీసుకురావాలని జేడీఏ సుచరిత కోరారు. ము న్సిపాలిటీలో ఏర్పాటు చేసిన ధాన్యం కొ ను గోలు కేంద్రాన్ని పరిశీలించారు. అదేవిధం గా మూసాపేట మండలంలోని వేముల, పో ల్కంపల్లి గ్రామాల్లో ధాన్యం కొనుగోలు కేం ద్రాలతోపాటు వేరుశనగ పంటను పరిశీలించారు. కార్యక్రమంలో ఏడీఏ యశ్వంత్రా వు, ఏవోలు మురళీధర్, రాజేందర్రెడ్డి, ఏఈవోలు శివ, శ్వేత, సీఈవో రత్నయ్య, ఏఈవో హర్షవర్ధన్ పాల్గొన్నారు.
వేగవంతం చేయాలి
హన్వాడ, డిసెంబర్ 1 : ధాన్యం కొనుగోలును వేగవంతం చేయాలని తాసిల్దార్ శ్రీనివాసులు అన్నారు. మండలకేంద్రంలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించా రు. కేంద్రంలో రైతులకు ఇబ్బందులు కలుగకుండా చూడాలని సూ చించారు. కార్యక్రమంలో సింగిల్విండో డైరెక్టర్ కొండా బాల య్య, ఆర్ఐలు ప్రవీణ్, కవిత పాల్గొన్నారు.