మంచిర్యాల : గత ఐదు రోజులుగా రాష్ట్ర వ్యాప్తంగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలకు జిల్లాలో జనజీవనం స్తభించిపోయింది. జైపూర్ మండలం టేకుమట్ల – శెట్పల్లి గ్రామాల మధ్యలో రసూల్పల్లి వాగు ఉప్పొంగి ప్రవహిస్తున్నది. దీందో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.
బుధవారం వాగును ప్రభుత్వ విప్ , చెన్నూరు ఎమ్మెల్యే బాల్క సుమన్ క్షేత్ర స్థాయిలో పరిశీలించారు. ఇప్పటికే ఈ వాగుపైన ఎనిమిది కోట్ల రూపాయలతో నూతన బ్రిడ్జి నిర్మించాలని ఎమ్మెల్యే బాల్క సుమన్ ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపామని ఆయన తెలిపారు. వచ్చే వర్షాకాలం లోపు వాగుపై బ్రిడ్జి నిర్మిస్తామని ఎమ్మెల్యే పేర్కొన్నారు.