విద్యాశాఖ మంత్రి సబితాఇంద్రారెడ్డి
తాండూరు, అక్టోబర్ 30: ప్రభుత్వ దవాఖానల్లో కార్పొరేట్ స్థాయి వైద్యం అందిస్తున్నట్టు విద్యా శాఖ మంత్రి పీ సబితాఇంద్రారెడ్డి తెలిపారు. శనివారం వికారాబాద్ జిల్లా తాండూరులో రూ.26.42 కోట్లతో చేపట్టిన పలు అభివృద్ధి పనులను ప్రారంభించారు. లబ్ధిదారులకు రూ.1.65 కోట్ల కల్యాణలక్ష్మి, షాదీముబారక్ చెక్కులను అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. తెలంగాణ ఏర్పడ్డాక సీఎం కేసీఆర్ పాలనలో ప్రజలకు కార్పొరేట్ స్థాయిలో ఉచితంగా వైద్యం, విద్య అందుతున్నదని తెలిపారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ పట్నం మహేందర్రెడ్డి, ఎమ్మెల్యేలు రోహిత్రెడ్డి, కాలె యాదయ్య తదితరులు పాల్గొన్నారు.