ఎల్కతుర్తి, అక్టోబర్ 17: కరోనాతో మరణించిన జర్నలిస్ట్ కుటుంబానికి రాష్ట్ర ప్రభుత్వం అండగా నిలిచింది. హనుమకొండ జిల్లా ఎల్కతుర్తి మండలానికి చెందిన ఓ పత్రికా విలేకరి పెద్దప్యాట శ్యాంకుమార్కు కరోనా సోకడంతో పలు దవాఖానల్లో చికిత్స పొందా రు. పరిస్థితి విషమించడంతో ఐదునెలల క్రితం మృతి చెందారు. శ్యాంకుమార్ కుటుంబ పరిస్థితి తెలుసుకున్న మంత్రి హరీశ్రావు సీఎం సహాయ నిధి నుంచి రూ.4 లక్షలు మంజూరు చేయించారు. ఆదివారం సిద్దిపేటలో శ్యాంకుమార్ భార్య, కూతురికి ఆ చెక్కు అందజేశారు. తమ కుటుంబానికి అండగా నిలిచిన మంత్రి హరీశ్రావుకు వారు కృతజ్ఞతలు తెలిపారు.