హైదరాబాద్: బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ పాదయాత్ర కొనసాగింపుపై ప్రభుత్వం హైకోర్టును ఆశ్రయించింది. బండి సంజయ్ పాదయాత్ర ఉద్రిక్త పరిస్థితులకు దారి తీస్తుండడంతో యాత్ర నిలిపేయాలని జనగామ పోలీసులు ఆయనకు నోటీసు ఇచ్చిన విషయం తెలిసిందే. దీంతో బండి సంజయ్ హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై విచారణ చేపట్టిన సింగిల్ జడ్జి.. పాదయాత్రకు అనుమతిస్తూ ఉత్తర్వులు జారీచేశారు.
ఈ నేపథ్యంలో సింగిల్ జడ్జి ఉత్తర్వులను సవాల్ చేస్తూ ప్రభుత్వం లంచ్ మోషన్ దాఖలు చేసింది. పాదయాత్ర సాగితే శాంతి భద్రతల సమస్య తలెత్తుతుందని అందులో పేర్కొన్నది. ఈ అప్పీలుపై అత్యవసరంగా విచారణ చేపట్టాలని హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ధర్మాసనాన్ని కోరింది. దీంతో మధ్యాహ్నం 1.15 గంటలకు సీజే ధర్మాసనం అంగీకరించింది.