హైదరాబాద్, నవంబర్ 5 (నమస్తే తెలంగాణ): ఆచార్య చందు సుబ్బారావు వార్షిక (2021) కళా పురస్కారానికి ప్రజా వాగ్గేయకారుడు, శాసనమండలి సభ్యుడు గోరటి వెంకన్న ఎంపికయ్యారు. ఈ నెల 8న విశాఖ పౌర గ్రంథాలయం హాల్లో ఈ పురస్కారాన్ని ప్రదానం చేయనున్నట్టు చందు సుబ్బారావు లిటరరీ అండ్ కల్చరల్ ట్రస్టు కార్యదర్శి ఉప్పల అప్పలరాజు ఒక ప్రకటనలో తెలిపారు. పురస్కారం కింద పదివేల రూపాయల నగదు, జ్ఞాపిక అందజేయనున్నట్టు పేర్కొన్నారు.