తిమ్మాపూర్ రూరల్/ చిగురుమామిడి, జనవరి 4: రేషన్ దుకాణాల్లో పారదర్శకంగా సరుకులు పంపిణీ చేయాలని రాష్ట్ర ఫుడ్ కమిషన్ చైర్మన్ తిరుమల్రెడ్డి సూచించారు. మంగళవారం తిమ్మాపూర్ మండలం రామకృష్ణకాలనీ, ఇందిరానగర్, మన్నెంపల్లి, చిగురుమామిడి మండలకేంద్రంలో కమిషన్ సభ్యురాలు భారతితో కలిసి పర్యటించారు. ఈ సందర్భంగా ఆయాగ్రామాల్లో పాఠశాలలు, అంగన్వాడీ సెంటర్లు, రేషన్ దుకాణాలను సందర్శించారు. మన్నెంపల్లి స్కూల్ విద్యార్థులతో ముచ్చటించారు. ఆహార నాణ్యతపై ఆరా తీశారు. అంగన్వాడీ కేంద్రంలో గర్భిణులు, బాలింతలు, పిల్లలకు పౌష్టికాహారం అందించాలని సూచించారు. అలాగే రేషన్ బియ్యాన్ని సద్వినియోగం చేసుకోవాలని గ్రామస్తులను కోరారు.
రామకృష్ణకాలనీ సర్పంచ్ మీసాల అంజయ్యతో మాట్లాడి బియ్యం పంపిణీ తీరును తెలుసుకున్నారు. కార్యక్రమంలో డీఈవో జనార్దన్రావు, తహసీల్దార్ రాజ్కుమార్, ఎంపీడీవో రవీందర్రెడ్డి, సీడీపీవో సబిత, ఎంఈవో శ్రీనివాస్, సర్పంచులు మీసాల అంజయ్య, కాటిక వినోద, మేడి అంజయ్య, ఎంపీటీసీ కొత్త తిరుపతిరెడ్డి, హెచ్ఎంలు పాల్గొన్నారు. చిగురుమామిడిలో జిల్లా పౌర సరఫరాల శాఖ అధికారి శ్రీనివాస్, ఎంపీపీ కొత్త వినీతా శ్రీనివాస్ రెడ్డి, సీడీపీఓ సబితా కుమారి, సర్పంచ్ బెజ్జంకి లక్ష్మణ్, తహసీల్దార్ ముబిన్ అహ్మద్, ఎంపీడీవో విజయలక్ష్మి, ఎంఈవో విజయలక్ష్మి, మండల వైద్యాధికారి నాగశేఖర్, ఆర్ఐ శ్రీనివాస్ తదితరులు ఉన్నారు.