మెదక్ మున్సిపాలిటీ, నవంబర్ 24 : ప్రభుత్వ పాఠశాలల్లో పనిచేస్తున్న పార్ట్టైం ఇన్స్ట్రక్టర్లకు ప్రభుత్వం తీపి కబురు అందించింది. గత నెల 25న ఆర్థిక శాఖ ఆమోదంలో తెలుపడంతో కాం ట్రాక్ట్ పద్ధతిలో పనిచేస్తున్న వీరిని తిరిగి 2021-22 విద్యా సంవత్సరానికి తీసుకోవాలని రాష్ట్ర విద్యాశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. జిల్లా కలెక్టర్ల ఆమోదంతో నియమించుకోవాలని సూచించింది. ప్రభుత్వ నిర్ణయంతో ఉమ్మడి మెదక్ జిల్లాలో 346మంది పార్ట్టైం ఇన్స్ట్రక్టర్లు విధుల్లోకి చేరనున్నారు. ఇప్పటికే ఉమ్మడి జిల్లాలో ఏ మండలంలో ఏయే పాఠశాలలో ఎవరు పనిచేస్తున్నారనే వివరాలు జిల్లా విద్యాశాఖ అధికారులు సేకరించి నివేదిక సిద్ధం చేశారు.
ప్రత్యక్ష తరగతుల ప్రారంభంతో..
ప్రభుత్వ పాఠశాలల్లో ఈయేడు ప్రవేశాలు భారీగా పెరగడంతో పాటు విద్యతో పాటు ఆర్ట్, వర్క్ ఎడ్యుకేషన్ సైతం విద్యార్థులకు అందించేలా విద్యాశాఖ చర్యలు తీసుకుంటోంది. దీంతో ఆయా అంశాలు బోధించే ఉపాధ్యాయులను సైతం విధుల్లోకి తీసుకోవాలని ప్రభుత్వం నిర్ణయించింది. కరోనా నేపథ్యంలో మార్చి 2020 నుంచి వీరిని విధుల్లో నుంచి తొలిగించారు. తిరిగి ప్రత్యక్ష తరగతులు ప్రారంభం కావడంతో విధుల్లోకి తీసుకునేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంది.
కలెక్టర్ ఆమోదంతో..
ఉమ్మడి మెదక్ జిల్లాలో 2019-20 విద్యా సంవత్సరంలో ఎంతమంది ఇన్స్ట్రక్టర్లుగా విధులు నిర్వహించారో సమాచారాన్ని ఇదివరకే ఆయా మండల విద్యాధికారులతో జిల్లా విద్యాశాఖ ఇప్పటికే సమాచారం సేకరించింది. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో కలెక్టర్లు ఆమోద ముద్ర వేయగానే విధుల్లోకి చేరనున్నారు. కరోనా కారణంగా 16 నెలలుగా విధులకు దూరంగా ఉన్నారు. ప్రభు త్వ నిర్ణయంతో పార్ట్టైం ఇన్స్ట్రక్టర్లు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
ఉమ్మడి జిల్లాలో 346మంది
ఉమ్మడి మెదక్ జిల్లాలో మొత్తం 88మంది పార్ట్టైం ఇన్స్ట్రక్టర్లు ఉండగా, వీరిలో 15మంది ఆర్ట్, 55వర్క్ ఎడ్యుకేటర్లు, 18మంది పీఈటీలు ఉన్నారు. సిద్దిపేట జిల్లాలో 155మంది ఉండగా, 38మంది ఆర్ట్, 82మంది వర్క్ ఎడ్యుకేటర్లు, 35మంది పీఈటీలున్నారు. సంగారెడ్డి జిల్లాలో 103మంది ఉం డగా, 23మంది ఆర్ట్, 68మంది వర్క్ ఎడ్యుకేటర్లు, 103మంది పీఈటీలున్నారు.
కరోనాతో విధులకు దూరం..
కరోనా నేపథ్యంలో ఆన్లైన్ తరగతులు నిర్వహించడంతో 16 నెలలుగా విధులకు దూరంగా ఉన్నాం. సెప్టెంబర్ 1 నుంచి ప్రత్యక్ష తరగతులు ప్రారంభం కావడంతో తమను తిరిగి విధుల్లోకి తీసుకోవాలని ఉత్తర్వులు జారీ చేయడం హర్షనీయం. ప్రభుత్వానికి కృతజ్ఞతలు. ప్రభుత్వం బకాయి వేతనాలు తొందరగా ఇవ్వాలి.