హైదరాబాద్ : శంషాబాద్లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో అక్రమంగా తరలిస్తున్న బంగారాన్ని కస్టమ్స్ అధికారులు గురువారం పట్టుకున్నారు. దుబాయి నుంచి EK-526 విమానంలో వచ్చిన వ్యక్తి నుంచి 2290 గ్రాముల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. పట్టుకున్న బంగారం విలువ రూ.1.20కోట్లు ఉంటుందని అధికారులు తెలిపారు. సూట్కేస్ రాడ్లో దాచి తరలిస్తుండగా బంగారాన్ని కస్టమ్స్ అధికారులు సీజ్ చేశారు. బంగారం తరలిస్తున్న వ్యక్తిని శుక్రవారం అరెస్టు చేశారు. ప్రస్తుతం కేసును విచారిస్తున్నట్లు అధికారులు పేర్కొన్నారు.