హైదరాబాద్: మహారాష్ట్ర వేదికగా జరిగిన జాతీయ టీమ్ చెస్ చాంపియన్షిప్లో తెలంగాణ యువ గ్రాండ్మాస్టర్లు రాజా రిత్విక్, హర్ష భరత్కోటి జోడీ స్వర్ణ పతకంతో మెరిసింది. ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఏఏఐ) తరఫున బరిలోకి దిగిన వీరు..మరో ముగ్గురితో కలిసి టీమ్ చాంపియన్షిప్ను కైవసం చేసుకున్నారు. వ్యక్తిగత విభాగంలో ఏడు రౌండ్లలో 6.5 పాయింట్లు స్కోరు చేసిన రిత్విక్ మరో పసిడిని తన ఖాతాలో వేసుకున్నాడు. ఏడు గేముల్లో ఆరింటిలో విజయాలు సాధించిన రిత్విక్… మరో గేమ్ను డ్రా చేసుకున్నాడు. జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో మెరుగైన ప్రదర్శన కనబరుస్తున్న రిత్విక్, భరత్కోటి..ప్రస్తుతం రామరాజు దగ్గర శిక్షణ తీసుకుంటున్నారు.