శంషాబాద్లో రూ.47.63 లక్షల విలువైన కిలో బంగారం పట్టివేత
శంషాబాద్, ఏప్రిల్ 1: బంగారం స్మగ్లింగ్ కొత్త పుంతలు తొక్కుతున్నది. రూ.47.63 లక్షల విలువైన 1.026 కిలోల బంగారాన్ని సన్నటి రేకులుగా మార్చి.. ప్యాకింగ్ కవర్ల పొరలలో సినీ ఫక్కీలో తరలిస్తున్న ఇద్దరిని శంషాబాద్ ఎయిపోర్టులో గురువారం కస్టమ్స్ అధికారులు పట్టుకున్నారు. దుబాయ్ నుంచి హైదరాబాద్కు వచ్చిన ఓ ప్రయాణికుడిపై అనుమానంతో కస్టమ్స్ అధికారులు తనిఖీ చేశారు. బంగారాన్ని రేకులుగా చేసి ప్యాకింగ్ కవర్ల పొరలలో దాచి ఉంచినట్టు గుర్తించారు. దాన్ని ఎయిర్పోర్టులో మరో వ్యక్తికి అప్పగించాలని ప్రయత్నించగా, నిఘాపెట్టి పట్టుకున్నారు.