Gold Rates | శ్రావణ మాసంలో పెండ్లిండ్లు.. మరోవైపు పండుగల సీజన్.. అమెరికా డాలర్పై రూపాయి మారకం విలువ పతనం కావడంతో కావడంతో బంగారం ధగధగ మెరుస్తున్నది. దేశ రాజధాని న్యూఢిల్లీలో 24 క్యారట్ల బంగారం తులం ధర రూ.50 తగ్గినా సోమవారం బులియన్ మార్కెట్ ట్రేడింగ్ ముగిసే సమయానికి రూ.60,050 వద్ద ముగిసింది. మరోవైపు కిలో వెండి ధర రూ.500 పెరిగి రూ.74,400 పలుకుతున్నదని హెచ్డీఎఫ్సీ సెక్యూరిటీస్ పేర్కొంది.
అంతర్జాతీయ మార్కెట్లో ఔన్స్ బంగారం ధర 1924 డాలర్లు, ఔన్స్ వెండి ధర 23.10 డాలర్లు పలుకుతున్నది. వారాంతపు నష్టాల తర్వాత సోమవారం అంతర్గత ట్రేడింగ్లో బంగారం ధర పెరిగిందని మోతీలాల్ ఓస్వాల్ ఫైనాన్సియల్ సర్వీసెస్ కమొడిటీ రీసెర్చ్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ నవ్నీత్ దమానీ చెప్పారు. వచ్చే యూఎస్ ఫెడ్ రిజర్వ్ సమావేశం వరకూ పరిస్థితి ఇలాగే కొనసాగుతుందన్నారు.
మరోవైపు, దేశీయంగా ఫ్యూచర్ మార్కెట్లో స్పాట్ డిమాండ్ పెరగడంతో అక్టోబర్ డెలివరీ బంగారం (24 క్యారట్లు) తులం ధర రూ.135 పెరిగి రూ.59,033 వద్ద ముగిసింది.అంతర్జాతీయంగా న్యూయార్క్లో ఔన్స్ బంగారం ధర 0.46 శాతం పుంజుకుని 1951.60 డాలర్ల వద్ద స్థిర పడింది.