హైదరాబాద్, నవంబర్ 7 (నమస్తే తెలంగాణ) : ఈ నెల 20, 21 తేదీల్లో నారాయణగూడలోని కేశవ మెమోరియల్ డిగ్రీ కాలేజీలో గోల్కొండ సాహితీ ఉత్సవాన్ని నిర్వహించనున్నట్టు కన్వీనర్ జీ వల్లీశ్వర్ తెలిపారు. ఆదివారం కాలేజీ ఆవరణలో లిటరరీ ఫెస్ట్ పోస్టర్ను విడుదల చేశారు. సమాచార భారతి ఆధ్వర్యంలో ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ థీమ్తో ఈ సాహితి ఉత్సవాన్ని నిర్వహిస్తున్నామన్నారు. రెండు రోజలు సదస్సులు, పుస్తకావిష్కరణలు ఉంటాయని, సాహిత్యాభిమానులు, పుస్తక ప్రియులు కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. కేశవ మెమోరియల్ విద్యాసంస్థల కార్యదర్శి డాక్టర్ అన్నాదానం సుబ్రహ్మణ్యం, సమాచార భారతి కార్యదర్శి ఆయుష్ కార్యక్రమంలో పాల్గొన్నారు.