దుబ్బాక;మండటెండల్లోనూ సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలంలోని కూడవెల్లి వాగు గోదావరి జలాలతో నిండుగా పారుతున్నది. యాసంగిలో సాగుచేసిన వరి వేసవి దృష్ట్యా ఎండిపోతున్న వేళ.. గోదావరి జలాలు రావడంతో పంటలు గట్టెక్కుతున్నాయి. మల్లన్నసాగర్ ద్వారా తొగుటలోని పంప్హౌస్ నుంచి నెలరోజులుగా నీటిని విడుదల చేస్తుండటంతో కూడవెల్లి వాగు జలకళను సంతరించుకున్నది. మల్లన్నసాగర్ కాల్వల ద్వారా దుబ్బాక నియోజకవర్గంలోని 21 చెరువులు మత్తళ్లు దుంకుతున్నాయి.