బంజారాహిల్స్, జనవరి 25: జూబ్లీహిల్స్ రోడ్ నం.88 లో ఎంపీ సీఎం రమేశ్ తన ఇంటి ముందున్న ఫుట్పాత్ను సుమారు 50 గజాలకుపైగా ఆక్రమించి, రెండంతస్తుల భవనాన్ని నిర్మించారు. ఈ విషయంపై స్థానికులు జీహెచ్ఎంసీ ఉన్నతాధికారులకు ఫిర్యాదులు చేయడంతో ఈ నెల 6న టౌన్ప్లానింగ్ సిబ్బంది కూల్చివేతలు చేపట్టారు. ఆ సమయంలో సీఎం రమేశ్ కు టుంబ సభ్యులతో పాటు కార్యాలయ సిబ్బంది జీహెచ్ఎంసీ సిబ్బందిని అడ్డుకునేందుకు ప్రయత్నించారు. దీంతో పాటు తామే అక్రమణలను తొలగిస్తామని చెప్పడంతో పాక్షికంగా కూల్చివేతలు చేపట్టారు. చెప్పిన విధంగా ఆక్రమణలను తొలగించకపోగా మరోసారి భవనాన్ని నిర్మించడంతో సమాచారం అందుకున్న జీహెచ్ఎంసీ టౌన్ప్లానింగ్ సిబ్బంది మంగళవారం అక్కడకు చేరుకుని కూల్చివేతలు చేపట్టారు. భారీ ఎత్తున నిర్మించిన భవనాన్ని నేలమట్టం చేశారు.