జూబ్లీహిల్స్,డిసెంబర్18:వ్యర్థాలకు ఒక అర్థం తెచ్చేలా .. పచ్చదనానికి శోభ పెంచేలా.. పరిశుభ్రతకు పట్టం కట్టేలా తాము చేసే పనుల్లో మార్పు తీసుకొస్తే చాలు.. ఆయా సంస్థలకు చాంపియన్లుగా బల్దియా బహుమాతులు అందజేస్తున్నది.స్వచ్ఛ సర్వేక్షణ్-2022లో భాగం గా విద్య, వైద్య, వ్యాపార సంస్థలకు ప్రశంసాపత్రాలతో గుర్తింపునిస్తున్నది. ఇందులో భాగంగా శ్రీరాంనగర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఉత్తమ వైద్య సేవలందిస్తున్న బెస్ట్ పీహెచ్సీగా, పచ్చదనం-పరిశుభ్రతలో యూసుఫ్గూడ ప్రభుత్వ ఉన్నత పాఠశాలను బెస్ట్ స్కూల్గా, వినియోగదారులకు ఉత్తమ సేవలందిస్తున్న సీజీఐ సంస్థకు బెస్ట్ ఆర్గనైజేషన్గా గుర్తించి శనివారం ప్రశంసాపత్రాలు అందజేశారు.
ఈ సందర్భంగా యూసుఫ్గూడ జీహెచ్ఎంసీ సర్కిల్ ఏఎంఓహెచ్ డాక్టర్ బిందుభార్గవి మాట్లాడుతూ స్వచ్ఛతను కాపాడేందుకు అంద రూ ఒక్కతాటిపైకి రావాలని పిలుపునిచ్చారు. శ్రీరాంనగర్ పీహెచ్సీలో పపరిశుభ్రతతో కూడిన నాణ్యమైన వైద్య సేవలందిస్తున్న వైద్య సిబ్బందిని అభినందించి ఎస్పీహెచ్ఓ డాక్టర్ అనురాధకు ప్రశంసాపత్రాన్ని అందజేశారు.
యూసుఫ్గూడ చెక్పోస్ట్ పాఠశాలలో పాఠశాల ఇన్చార్జి హెచ్ఎం నరసింహ ఆధ్వర్యంలో పచ్చదనం, పరిశుభ్రత పెంపొందించడంలో ఉపాధ్యాయులు, విద్యార్థులు భాగస్వాములు కావడం అభినందనీయమన్నారు. స్వచ్ఛ సర్వేక్షణ్లో భాగంగా చిత్రలేఖనం పోటీల్లో ప్రతిభ కనబరిచిన యూసుఫ్గూడ ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు ప్రశంసా పత్రాలు అందజేశారు.