న్యూఢిల్లీ, మార్చి 27: మలేరియా, డెంగ్యూ లాంటి రోగకారక దోమలను నిర్మూలించి రోగాలను అరికట్టేందుకు అమెరికాలో జన్యుమార్పిడి దోమలతో చేసిన ప్రయోగం సక్సెస్ అయింది. పైలట్ ప్రాజెక్టు కింద జన్యు మార్పిడి చేసిన దోమలను గాల్లోకి వదిలివేయాలని భావిస్తున్నారు. కొన్ని రోజుల్లో ఫ్లోరిడా, కాలిఫోర్నియాలో కోట్లా ది జెనెటిక్ దోమలను ప్రవేశపెట్టనున్నట్టు సమాచారం. యూకేకు చెందిన ఆక్సిటెక్ సంస్థ దోమల్లో జన్యు మార్పిడి చేసింది. వీటిని గాల్లోకి వదిలేయడానికి అమెరికా పర్యావరణ పరిరక్షణ సంస్థ అనుమతించింది. జెనెటిక్ దోమలు రోగకారక దోమలతో కలిసినప్పుడు అవి చనిపోతాయి. ఫలితంగా రానురాను వాటి సంఖ్య తగ్గిపోయి రోగాలను అరికట్టవచ్చని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు.