హైదరాబాద్ : ఉప ఎన్నికల్లో నైతిక విజయం టీఆర్ఎస్దేనని.. ఆ పార్టీ హుజూరాబాద్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ అన్నారు. ఉప ఎన్నికల ఫలితాలపై ఆయన కరీంనగర్లో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఈ ఎన్నికలో బీజేపీ, కాంగ్రెస్ కుమ్మక్కయ్యాయని, ఇందుకు కాంగ్రెస్ అభ్యర్థికి వచ్చిన ఓట్లు, ఆ పార్టీ నేతల ప్రకటనలు చూస్తే అర్థమవుతుందన్నారు. దేశమంతటా రెండు పార్టీలు పొట్లాడుకుంటాయని.. హుజూరాబాద్కు వచ్చే వరకు రెండు పార్టీలు ఏకమయ్యాయని విమర్శించారు. వచ్చే ఎన్నికల్లో హుజూరాబాద్ గడ్డపై గులాబీ జెండా ఎగుర వేస్తామని పేర్కొన్నారు.
టీఆర్ఎస్ కార్యకర్తలు, నేతలు శక్తి వంచన లేకుండా కృషి చేస్తారని, 2023లో హుజూరాబాద్ గడ్డపై ఎగిరేది గులాబీ జెండానేనన్నారు. ప్రజాస్వామ్యంలో గెలుపు ఓటమలు సహజమేనని.. ఓటమికి తానే నైతిక బాధ్యత వహిస్తున్నానన్నారు. ఈ సందర్భంగా ఈటల రాజేందర్కు శుభాకాంక్షలు తెలిపారు. టీఆర్ఎస్ పార్టీ 20 ఏళ్ల ప్రస్థానంలో అనేక గెలుపు ఓటమలను చవి చూసింది, ఓడిపోయిన కుంగిపోయే.. గెలిచిన రోజు పొంగిపోలేదన్నారు. వచ్చే ఎన్నికల్లో హుజూరాబాద్లో పోరాడుతామని, ప్రజలు తమను ఆదరిస్తారన్న విశ్వాసం ఉన్నారు. ఈ ఎన్నికల్లో ఓటేసిన ఓటర్లకు పాదాభివందనాలు తెలిపారు. పార్టీ గెలుపు కోసం కృషి చేసిన కార్యకర్తలు, నేతలు, ప్రజాప్రతినిధులు అభినందనలు తెలిపారు.