‘శుభం’ చిత్రంతో మంచి గుర్తింపును తెచ్చుకున్నాడు యువ నటుడు హర్షిత్ రెడ్డి. ఆయన కథానాయకుడిగా నటిస్తున్న తాజా చిత్రం ‘దీవాన’. ఈ ప్రేమకథా చిత్రానికి శ్రీకాంత్ సంగిశెట్టి దర్శకుడు. ఈ వేసవిలోనే గీతా ఫిల్మ్ డిస్ట్రిబ్యూటర్స్ ద్వారా విడుదల చేయబోతున్నట్లు మేకర్స్ తెలిపారు. ఈ సందర్భంగా మంగళవారం ఫస్ట్లుక్ పోస్టర్ను విడుదల చేశారు.
తీవ్ర భావోద్వేగాలతో సాగే ప్రేమకథా చిత్రమిదని, నేటి యువత మెచ్చే అన్ని అంశాలుంటాయని చిత్ర బృందం తెలిపింది. ఈ చిత్రానికి కెమెరా: వంశీ పచ్చిపులుసు, సంగీతం: ఈశ్వర్చంద్, నిర్మాతలు: వాసుదేవ్ కొప్పినేని, శ్రీదేవి కార్యంపూడి, రచన-దర్శకత్వం: శ్రీకాంత్ సంగిశెట్టి.