సీనియర్ కథానాయిక కేథరిన్ మంచి ఫామ్లో ఉంది. ప్రస్తుతం తెలుగులో భారీ అవకాశాలతో దూసుకుపోతున్నది. తాజా సమాచారం ప్రకారం ఈ భామ టాలీవుడ్లో మరో బంపరాఫర్ను సొంతం చేసుకున్నట్లు తెలిసింది. వివరాల్లోకి వెళితే…చిరంజీవి కథానాయకుడిగా బాబీ దర్శకత్వంలో ఓ చిత్రం రూపొందుతున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం చిత్రీకరణ జరుగుతున్నది. చిరంజీవి నటిస్తున్న 154వ చిత్రమిది. ఇందులో రవితేజ కీలక పాత్రలో నటిస్తున్నారు. చిరంజీవి సరసన ప్రధాన నాయికగా శృతిహాసన్ను ఎంపిక చేశారు. రవితేజ జోడీగా నటించే హీరోయిన్ కోసం చిత్ర బృందం అన్వేషణలో ఉన్నట్లు వార్తలు వినిపించాయి. తాజా సమాచారం ప్రకారం ఈ సినిమాలో రెండో నాయికగా కేథరిన్ను ఖరారు చేసినట్లు తెలిసింది. రవితేజతో ఆమెకిది తొలి చిత్రం కావడంతో.. ఈ జంట ఆన్స్క్రీన్ కెమిస్ట్రీ ఆకట్టుకుంటుందనే ఆలోచనతో చిత్రబృందం కేథరిన్ వైపు మొగ్గు చూపిందని అంటున్నారు. ఈ విషయమై త్వరలో అధికారిక ప్రకటన వెలువడనుంది. ప్రస్తుతం కేథరిన్ తెలుగులో ‘బింబిసార’ ‘మాచర్ల నియోజకవర్గం’ చిత్రాల్లో నటిస్తున్నది.